———
అహం మోహానికి ఒరిగి
సమూహం సత్తాకు మరిగి
వికృత విబేధాల పెరిగి
ప్రతి మెదడు మలినాన
మొలిచి, నిలిచి గెలిచి
సమాజానికి, జనానికి మత్తై
నీది, నాది,
మాది, మీది
ఆలోచనల అవధై
ప్రేమ, దయ
జాలి, కరుణ
పదాల సమాధై
సత్యమేవజయతేకి
స్వార్థమేవజయతే
పర్యాయపదమై
నిజం, నిజాయితీలను
నగ్నంగా నిలబెట్టి
జాతీయాల చదువుకోమని
వెకిలిగా వెక్కిరిస్తూ
మనిషి మనసును
ఉనికిని, హేళన చేసే
అంతరంగ అశుద్ధం
తెలుగు పూదోట
ఏపుగా పెరిగి..
క్షవరం అవసరమైన
తెలుగు అక్షరం స్వార్థం!